కల్తీ మద్యం సేవించి వ్యక్తి మృతి

9 Nov, 2017 08:04 IST|Sakshi

జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని కాటారం మండలంలోని గుమ్మళ్లపల్లి గ్రామంలో కల్తీ మద్యం కలకలం రేపుతోంది. బుధవారం సాయంత్ర కల్తీ మద్యం సేవించి పలువురు అస్వస్థతకు గురి కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. వారిలో ఎర్రోళ్ల లాస్మయ్య(50) చికిత్స పొందుతూ మృతిచెందాడు. మరో ఆరుగురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విధి నిర్వాహణలో నిర్లక్ష్యం వహించిన కాటారం ఎక్సైజ్‌ ఎస్సై శీలం రాజేశ్వరిని సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌ మురళి ఆదేశాలు జారీచేశారు.

మరిన్ని వార్తలు