టిప్పర్-బైక్ ఢీ.. ఒకరి మృతి

4 Feb, 2015 14:29 IST|Sakshi

వరంగల్: వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ ఢీకొని రిటైర్డ్ ప్రధానపాధ్యాయుడు ఇ. ఉప్పిరెడ్డి (70) మృతిచెందారు. బుధవారం ఉదయం వరంగల్ వెళ్లి తిరిగి వస్తున్న ఉప్పిరెడ్డిని వర్ధన్నపేట నుంచి వరంగల్ వైపు వేగంగా వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు.

ఈ సంఘటన వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారిపై మామునూరు సమీపంలోని రిలయన్స్ పెట్రోల్‌బంకు వద్ద జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు