మంత్రి సతీమణి కారు ఢీకొని వ్యక్తికి గాయాలు

3 Sep, 2015 19:07 IST|Sakshi

కుత్బుల్లాపూర్ (రంగారెడ్డి) : దేవాదాయశాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌ రెడ్డి సతీమణి ప్రయాణిస్తున్న కారు ఢీకొని ఒకరు గాయపడ్డారు. పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి సీఐ రంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... గురువారం రంగారెడ్డి జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన దొడ్ల రమేష్, ఇ.రమేష్ అనే ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తుండగా కొంపల్లి చంద్రగార్డెన్స్ సమీపంలో మంత్రి సతీమణి ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వచ్చి ఢీకొంది.

ఈ ప్రమాదంలో బైక్‌పై వెనుక కూర్చున్న దొడ్ల రమేష్ కాలు విరిగిపోయింది. అతడిని వెంటనే పేట్‌బషీరాబాద్‌లో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మంత్రి కారు డ్రైవర్ రవికుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు