'సర్వ నాశనం చేసి... ఇంకా పార్టీలో ఉన్నారు'

29 Jan, 2015 12:34 IST|Sakshi
'సర్వ నాశనం చేసి... ఇంకా పార్టీలో ఉన్నారు'

హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధోగతి పాలు చేస్తున్న నాయకులపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పి.శంకర్రావు గురువారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. తెలంగాణలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని సోంత పార్టీ వారే సర్వనాశనం చేశారని ఆరోపించారు. వారు ఇంకా పార్టీ కీలక పదవుల్లోనే కొనసాగుతున్నారని చెప్పారు.

అలాంటి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే తప్పా పార్టీకి భవిష్యత్తు లేదని అన్నారు. తనతోపాటు గతంలో మంత్రులుగా పని చేసిన వారిపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ను పి.శంకర్రావు డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణల వల్లే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఓడిపోయిందని పి.శంకర్రావు విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
 

మరిన్ని వార్తలు