సాక్షి, హైదరాబాద్: లంగర్హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. బాపు ఘాట్ వద్ద ఇరు వర్గాల మధ్య గొడవ జరగుతుండగా.. ఇద్దరు పోలీసులు ఆపడానికి వెళ్లారు. అయితే అక్కడున్నవారు పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో లంగర్హౌస్ పీఎస్కు చెందిన హోంగార్డ్ ఆమేర్కు, నార్సింగి పీఎస్కు చెందిన కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. దీంతో వీరిని ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.