గిరిజ కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు

13 Oct, 2014 13:26 IST|Sakshi

మంచాల : బోరుబావిలో పడిపోయిన చిన్నారి గిరిజను రక్షించేందకు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా మంచాలలో ఆడుకుంటూ ఆదివారం ప్రమదవశాత్తూ చిన్నారి బోరుబావిలో పడిపోయిన విషయం తెలిసిందే. దాంతో రంగంలోకి దిగిన అధికార బృందాలు  నుంచి సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

 

అయితే ఇప్పటివరకూ గిరిజ జాడ తెలియలేదు. ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది ప్రత్యేక పరికరాలతో డ్రిల్లింగ్ చేస్తున్నారు. అయితే సహాయక చర్యలకు బండరాళ్లు అడ్డుపడుతున్నాయి. ఇప్పటివరకూ నలభై అడుగుల మేర తవ్వకాలు జరిపారు. మరోవైపు బోరులో 40 అడుగుల వద్ద నీరు ఉన్నట్లు గుర్తించారు.

మరిన్ని వార్తలు