అలియాబాద్లో చోరీ

12 May, 2016 08:21 IST|Sakshi

శామీర్‌పేట : రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలం అలియాబాద్ గ్రామంలోని సోపరి మధు అనే వ్యక్తి ఇంట్లో బుధవారం అర్థరాత్రి చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దుండగులు తాళాలు పగలగొట్టి రూ.40 వేల నగదు, 8 తులాల బంగారం దోచుకెళ్లారు. గురువారం ఉదయం ఆ విషయాన్ని గమనించిన స్థానికులు మధుకు సమాచారం ఇచ్చిరు. మధు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి.... దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా పోలీసులు దుండగులు చోరీ చేసిన తీరును పరిశీలించారు.
 

మరిన్ని వార్తలు