బృందావన కాలనీలో చోరీ

29 Nov, 2015 13:19 IST|Sakshi

హైదరాబాద్ : గోల్కొండ పరిధిలోని టోలిచౌకి బృందావనకాలనీలో శనివారం రాత్రి చోరీ జరిగింది. కాలనీలో నివాసముంటున్న మహ్మద్ ముస్తఫా అనే వ్యక్తి ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలో ఉన్న రూ.6 లక్షల నగదు, 20 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు