ఆర్టీసీ కార్మికులకు ఫిట్‌మెంట్ ఇవ్వాలి

14 Feb, 2015 02:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వోద్యోగులకు ప్రకటించినట్టుగానే తమకు ఫిట్ మెంట్ కావాలని ఆర్టీసీ ఉద్యోగులు కోరనున్నారు. ఏపీ, తెలంగాణ ల్లోని ప్రభుత్వోద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు వేతన సవరణ (ఫిట్‌మెంట్) చేయాలని కోరుతూ ఈ నెల 16న ఆర్టీసీ ఎండీకి నోటీసివ్వనున్నట్టు ఎంప్లాయిస్ యూనియన్, తెలంగాణ  మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శులు కె.పద్మాకర్, ఇ.అశ్వద్ధామరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేతనాల సవరణ ప్రక్రియ కోసం పే కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని కోరనున్నట్లు పేర్కొన్నారు.

 

మరిన్ని వార్తలు