యాదాద్రి ప్లాన్‌కు ప్రత్యేక పూజలు

3 Sep, 2015 19:46 IST|Sakshi

యాదగిరికొండ (నల్లగొండ జిల్లా): యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి సంబంధించి యాదాద్రి అభివృద్ధి ప్రాజెక్టు మాస్టర్ ప్లాన్ నమూనాకు గురువారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి, తమిళనాడుకు చెందిన స్థపతులు ఇందులో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ఆమోదించిన మాస్టర్ ప్లాన్‌ను త్రిదండి చిన్న జీయర్‌స్వామికి చూపించిన తర్వాత.. పాంచరాత్రాగమ సిద్ధాంతం ప్రకారం అంతా బాగానే ఉందని స్వామి అంటే పనులు ప్రారంభం అవుతాయని ఆనంద్‌సాయి తెలిపారు.

మరిన్ని వార్తలు