టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు ఉచిత శిక్షణ

31 May, 2015 18:55 IST|Sakshi

రంగారెడ్డి(శంషాబాద్): పదవ తరగతి ఫెయిలైన విద్యార్థులకు మండల కేంద్రంలోని శ్రీ విజ్ఞాన్ కళాశాల ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో వెల్లడించారు. జూన్ 3 తేదీ నుంచి గణితం, భౌతికశాస్త్రం సబ్జెక్టులకు సంబంధించి రాబోయే సప్లిమెంటరీ పరీక్షలకు శిక్షణ ఇవ్వనున్నట్లు కరస్పాండెంట్ సతీష్ వివరించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఫోన్: 9989021453 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

మరిన్ని వార్తలు