వింత శిశువు జననం..వెయ్యి మందిలో ఒకరే..!

12 Nov, 2019 20:17 IST|Sakshi

సాక్షి, నిర్మల్‌ : భైంసా పట్టణంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో సోమవారం రాత్రి ఓ గర్భిణి వింత శిశువుకు జన్మనిచ్చింది. మహారాష్ట్రకు చెందిన సదరు గర్భిణికి పురిటినొప్పులు రావడంతో కుటుంబీకులు భైంసాలోని సాక్షి ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకోచ్చారు. ఆపరేషన్ చేయగా.. వింత శిశువు జన్మించింది. శిశువు తల భాగం పోడువుగా ఉండి, పళ్లు బయటకు రావడం, చర్మ మొత్తం కాలిపోయి ఉన్నట్లు పుట్టింది. అయితే శిశువు మాత్రం ఆరోగ్యంగానే ఉందని వైద్యులు తెలిపారు. వెయ్యి మందిలో ఒకరు ఇలా పుట్టే అవకాశముందని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు