ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో..

11 Nov, 2017 08:39 IST|Sakshi

పురుగుల మందు తాగి విద్యార్థిని ఆత్మహత్య

మునుగోడు (మర్రిగూడ) : ప్రియుడు పెళ్లికి నిరాకరంచడంతో ఓ విద్యార్థిని బలవన్మణానికి పాల్పడింది. వివరా లు.. మర్రిగూడ మండలం సరంపేటకు చెందిన నక్క పాపయ్య–సత్తమ్మ దంపతులకు ఐదుగురి సంతానం. మూడో కూతురు నక్క వెన్నెల (17) మండల కేంద్రంలోని ఓ కాలేజీలో ఇంటర్‌ చదువుతోంది.ఈమె తమ సమీప బంధువును కొంత కాలం నుంచి ప్రేమిచింది. పెళ్లి చేసుకోవాలని సదరు యువకుడిని అడగడతో నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెందిన  చెంది సరంపేట క్రాస్‌ రోడ్డు వద్ద పురుగుల మందు తాగింది. ఆమెను మర్రిగూడ ప్రభుత్వ ఆస్పత్రీకి తీసుకువస్తుడంగా మధ్యమార్గంలో చనిపోయింది.  కేసు నమోదు యేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు  స్థానిక ఎస్‌ఐ కె.కొండల్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు