తెలంగాణ అసెంబ్లీ, మండలి వాయిదా

13 Mar, 2017 13:21 IST|Sakshi

హైదరాబాద్‌ : తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు బుధవారానికి వాయిదా పడ్డాయి. ఈ రోజు ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ 2017-18 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌  ప్రసంగం అనంతరం స్పీకర్‌ మధుసూదనాచారి సమావేశాలను ఎల్లుండికి వాయిదా వేశారు. మరోవైపు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కూడా శాసనమండలిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టగా, ప్రసంగం అనంతరం మండలి కూడా బుధవారానికి వాయిదా పడింది.

 

మరిన్ని వార్తలు