తెలంగాణ సీఐడీ చీఫ్గా చారుసిన్హా

26 Jul, 2014 14:18 IST|Sakshi

హైదరాబాద్: రాష్ట్రంలో ఇద్దరు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర సీఐడీ చీఫ్గా ఉన్న టి.కృష్ణప్రసాద్ను టెక్నికల్ సర్వీసెస్ చీఫ్గా బదిలీ చేసింది. అలాగే సీఐడీ చీఫ్గా చారు సిన్హాను నియమించారు. టి.కృష్ణ ప్రసాద్ 1986వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి కాగా, చారు సిన్హా 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి.    
 

మరిన్ని వార్తలు