హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీపై బదిలీ వేటు

20 Oct, 2023 15:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీపై బదిలీ వేటు పడింది. ఈసీ ఆదేశాలతో ప్రభుత్వం బదిలీ చేసింది. నాలుగేళ్లుగా టాస్క్‌ఫోర్స్‌ ఓఎస్డీగా రాధాకృష్ణ కొనసాగుతున్నారు. పదవీ విరమణ తర్వాత ఓఓస్డీగా విధులు నిర్వహిస్తున్నారు.

కాగా, తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ అధికారులకు పోస్టింగ్స్‌ లభించాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

టీఎస్‌పీఎస్‌ఏ జాయింట్ డైరెక్టర్‌గా రంగనాథ్‌
టీఎస్‌పీఎస్‌ఏ డిప్యూటి డైరెక్టర్ గా రాజేంద్ర ప్రసాద్
సీఐడీ ఎస్పీగా శ్రీనివాస్ రెడ్డి
గ్రే హౌoడ్స్ ఎస్పీగా వెంకటేశ్వర్లు
సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా నితికా పంత్
సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా రోహిత్ రాజ్
ట్రాఫిక్ డీసీపీగా ఆర్‌. వెంకటేశ్వర్లు
పెద్దపల్లి డీసీపీగా సునీతా మోహన్


 

మరిన్ని వార్తలు