వివాహిత మృతి కేసు.. తండ్రే హంతకుడు

27 May, 2015 01:52 IST|Sakshi

రాయికోడ్ : మండలంలోని ఇందూర్ గ్రామంలో ఈ నెల 20వ తేదీన వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటనలో కన్నతండ్రే హంతకుడిగా పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం జహీరాబాద్ రూరల్ సీఐ రఘు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు  వివరించారు.
 
 ఇందూర్ గ్రామానికి చెందిన రుకియా బేగం (30) ఈ నెల 20న ఇందూర్‌లోని తన తల్లిదండ్రుల ఇంట్లో మృతి చెందింది. అయితే  బేగం మృతిపై అత్తింటి వారు అనుమానం వ్యక్తం చేయడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
 
 ఈ క్రమంలో తండ్రిని విచారించగా.. తన కుమార్తె మానసిక స్థితి సరిగా లేక భరించలేక ఈ నెల 29వ రాత్రి చీరతో ఉరేసి హత్య చేసినట్లు మృతురాలి తండ్రి గౌస్ మొహల్లా ఒప్పుకున్నాడు. దీంతో అతడిపై హత్యకేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. సమావేశంలో ఎస్‌ఐ శివప్రసాద్, హెడ్‌కానిస్టేబుల్ గౌస్, కానిస్టేబుల్ భీంరావు ఉన్నారు.
 

మరిన్ని వార్తలు