విధులను బహిష్కరించిన మున్సిపల్ సిబ్బంది

4 Jun, 2015 12:23 IST|Sakshi

మెదక్: బిల్ కలెక్టర్‌పై జరిగిన దాడికి నిరసనగా గురువారం మెదక్ జిల్లా సంగారెడ్డి మున్సిపల్ సిబ్బంది విధులను బహిష్కరించి ధర్నాకు దిగారు. మున్సిపాలిటీ పరిధిలో బిల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న ముఖ్తార్‌పై టీఆర్‌ఎస్ నాయకుడు జీవీ శ్రీనివాస్ బుధవారం దాడికి పాల్పడ్డారు. దీనికి నిరసనగా గురువారం విధులను బహిష్కరించిన సిబ్బంది అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు