హైదరాబాద్: ఆస్తిపన్ను చెల్లించడానికి గురువారం ఆఖరు తేదిగా జీహెచ్ఎమ్సీ కమిషనర్ సోమేష్కుమార్ తెలిపారు. ఆస్తిపన్నుపై ఆదాయం 150 కోట్ల రూపాయలు దాటే అవకాశం ఉన్నట్టు ఆయన చెప్పారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మే 16 నుంచి 2 వరకు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కాలనీ వెల్ఫేర్ కమిటీలకే అభివృద్ధి పనులు చేస్తామని తెలిపారు. అదేవిధంగా జీహెచ్ఎమ్సీ ఎన్నికలపై కసరత్తు.. డివిజన్ల విభజన ప్రక్రియ కొనసాగుతోందని జీహెచ్ఎమ్సీ కమిషనర్ సోమేష్ కుమార్ పేర్కొన్నారు.