ఎన్నికల సిబ్బందికి శిక్షణ

1 Apr, 2019 16:55 IST|Sakshi
నిర్మల్‌లో మాట్లాడుతున్న ఆర్డీవో, లక్ష్మణచాంద: పాల్గొన్న ఎన్నికల సిబ్బంది 

ఈవీఎంలు, వీవీ ప్యాట్లపై పనితీరు వివరించిన తహసీల్దార్‌

సారంగపూర్‌/లక్ష్మణచాంద/మామడ/నిర్మల్‌టౌన్‌: మండలకేంద్రంలోని స్త్రీశక్తి భవనంలో తహసీల్దార్‌ ప్రభాకర్‌ ఆధ్వర్యంలో ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవీఎంలు, వీవీ ప్యాట్ల పనితీరు, ఓటరుకు ఓటు జారీ చేసే విధానం, ఓటు వేశారా లేదా అని తెలుసుకోవడం తదితర అంశాలపై ప్రిసైడింగ్‌ అధికారులు, ఎన్నికల సిబ్బందికి శిక్షణనిచ్చారు. ఈవీఎంలు మొరాయిస్తే తీసుకోవాల్సిన చర్యలు, అందుబాటులో ఉండే రూట్‌ అధికారులకు సమాచారాన్ని చేరవేయడం అనే అంశాలపై తహసీల్దార్‌ శిక్షణ ఇచ్చారు. డీటీ సంతోష్, ఎంఆర్‌ఐ తక్కన్న, వీఆర్వో ప్రకాశ్, సిబ్బంది, ఎన్నికల అధికారులు ఉన్నారు. కాగా, లక్ష్మణచాంద ఎంపీడీవో కార్యాలయంలో తహíసీల్దార్‌ సుధాకర్, మామడ మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో రమేశ్, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  కూడా శిక్షణ ఇచ్చారు. ఆర్డీవో ప్రసూనాంబా, తహసీల్దార్‌ శివప్రసాద్, శిక్షకులు పీజీరెడ్డి, రవికుమార్, నాగేశ్వర్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు