-
గోపాల్ పేట్: పనికి వెళ్లమని చెప్పిన తల్లిని కన్నకొడుకే కడతేర్చిన ఘటన మహబూబ్నగర్ జిల్లా గోపాల్పేట్లో శనివారం వెలుగుచూసింది. మండల కేంద్రానికి చెందిన జంగిడి అక్కమ్మ పశువులను మేపుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు ఆరోగ్యం బాగలేకపోవడంతో.. కొడుకు శేఖర్ను పశువుల వద్దకు వెళ్లమని బతిలాడింది. దీనికి కోపోద్రిక్తుడైన అతను తల్లిని ఛాతిపై బలంగా తన్నడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు శేఖర్కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.