మహిళపై అత్యాచారం, హత్య

6 Dec, 2015 18:19 IST|Sakshi

కాటారం(కరీంనగర్ జిల్లా): కాటారం మండలం చింతకానిలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పోశయ్య(50) సొంత వదినపైనే తాగిన మైకంలో శనివారం అర్ధరాత్రి అత్యాచారం చేశాడు. అనంతరం గొంతు నులిమి హతమార్చాడు. మృతురాలికి భర్త లేడు. నిందితుడు పోశయ్యను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు