వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

20 Jun, 2015 17:06 IST|Sakshi

కరీంనగర్ (మంథని) : కరీంనగర్ జిల్లా మంథనిలో వైఎస్సార్‌సీపీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించింది.  వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సెగ్గం రాజేష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు శనివారం ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ శిబిరంలో దాదాపు 500 మంది పేదలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అలాగే పలువురు రోగులకు మందులు ఉచితంగా పంపిణీ చేశారు.

మరిన్ని వార్తలు