వ్యాన్ - రైలు ఢీ : ఐదుగురి మృతి

12 May, 2015 13:53 IST|Sakshi
వ్యాన్ - రైలు ఢీ : ఐదుగురి మృతి

లక్ష్మీపూర్: ఉత్తరప్రదేశ్ లక్ష్మీపూర్లోని మయిగల్గంజి ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న వాహనాన్ని సీతాపూర్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. జుమాయి నుంచి షాజహాన్పూర్ వెళ్తున్న పెళ్లి బృందం వ్యాన్ .. కాపలా లేని రైల్వే క్రాసింగ్ దాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.

ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సీతాపూర్ జిల్లా ఆస్పుత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. రైలు వస్తున్న సంగతి వ్యాన్ డ్రైవర్ గుర్తించకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
 

మరిన్ని వార్తలు