26 నుంచి చంద్రబాబు చైనా పర్యటన

21 Jun, 2016 18:10 IST|Sakshi

హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన చైనా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 25న ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి చైనాకు వెళ్లనున్నారు. 26 నుంచి 29వరకు 10వ యాన్యువల్ మీటింగ్ అఫ్ న్యూ చాంపియన్స్ కార్యక్రమానికి హజరు కానున్నారు.

అనంతరం రాజధాని నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్న కంపెనీని సందర్శించి అక్కడి ప్రతినిధులతో భేటీ కానున్నారు. అలాగే రాష్ట్రంలో పెట్టుబడులపై పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతారు. ఈ చైనా పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రితో సహ13 మంది అధికారులు, మంత్రులు పర్యటించనున్నారు. తిరిగి జూలై 1న ఈ బృందం విజయవాడ చేరుకోనుంది.

1. ముఖ్యమంత్రి చంద్రబాబు
2. మంత్రి యనమల రామక్రిష్ణుడు
 3.మంత్రి నారాయణ
4.పరకాల ప్రభాకర్
5.రమేష్ బాబు ఐఏఎస్
6.సాయి ప్రసాద్ ఐఏఎస్
7.అజయ్ జైన్ ఐఏఎస్&పీఎస్
8.సాల్మన్ రాజ్ ఐఏఎస్
9.ప్రద్యుమ్న ఐఏఎస్
10.లక్ష్మీ పార్దసారధి రిటైర్డ్ ఐఏఎస్
11.జాస్తి క్రిష్ణ కిషోర్ ఐఆర్ఎస్
12.బత్తినేని రాజగోపాల్ సీఎం పీఏ
13.ముద్రగడ నాగేంద్రరావు సీఎస్వో

మరిన్ని వార్తలు