జీఎస్టీ కౌన్సిల్ అదనపుకార్యదర్శి గా అరుణ్ గోయల్

24 Sep, 2016 16:00 IST|Sakshi

న్యూఢిల్లీ:  జీఎస్టీ కౌన్సిల్   అదనపు కార్యదర్శిగా సీనియర్  ఐఎఎస్ అధికారి అరుణ్ గోయల్  నియమితులయ్యారు. గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) అమలుకోసం కొత్తగా సృష్టించిన  కౌన్సిల్ అడిషనల్ సెక్రటరీ నియామకాన్ని కేబినెట్ నియామకాల కమిటీ  ఆమోదించిందనీ  డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ జారీ చేసిన  ఒక ప్రకటనలో  తెలిపింది.
గోయల్,   కేంద్ర పాలిత ప్రాంతాలు కేడర్కు కు చెందిన 1985 బ్యాచ్ ఐఎఎస్ అధికారి. చెందిన  ప్రస్తుత  ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ లో పని అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు.  ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో కౌన్సిల్ పన్ను రేటు, మినహాయింపు వస్తువులు మరియు ప్రారంభ పరిమితిని నిర్ణయించడంక తప్పనిసరి. ఏకీకృత  పన్ను వ్యవస్థను తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన జీఎస్టీ అమలు కోసం ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కౌన్సిల్‌కు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే.

 

>
మరిన్ని వార్తలు