సింగపూర్ ప్రధానితో చంద్రబాబు భేటీ

22 Sep, 2015 10:27 IST|Sakshi
సింగపూర్ ప్రధానితో చంద్రబాబు భేటీ

సింగపూర్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సింగపూర్ ప్రధానమంత్రి లీ సీన్ లుంగ్ తో సమావేశమయ్యారు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు లీ సీన్ లుంగ్ ను ఆయన ఆహ్వానించారు. తమ రాష్ట్రంలో మౌలిక వసతుల ఏర్పాటుకు సహకరించాలని సింగపూర్ ప్రధానమంత్రిని చంద్రబాబు కోరారు.

అక్టోబర్ 22న ఏపీ రాజధాని అమరావతి నగరం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. రాజధాని డిజైన్, నిర్మాణ పనులను సింగపూర్ సంస్థలకు ప్రభుత్వం అప్పగించిన సంగతి తెలిసిందే.

 

మరిన్ని వార్తలు