20 రోజుల్లో భారత్కు ఛోటా రాజన్

1 Nov, 2015 10:31 IST|Sakshi
20 రోజుల్లో భారత్కు ఛోటా రాజన్

బాలి: అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ను ఇండోనేసియా నుంచి భారత్కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. భారత దౌత్యాధికారి సంజీవ్ అగర్వాల్ బాలి జైల్లో ఉన్న ఛోటా రాజన్ను కలిశారు.

ఛోటా రాజన్ను భారత్కు తీసుకువచ్చే విషయంపై సంజీవ్ అగర్వాల్.. ఇండోనేసియా అధికారులతో చర్చించారు. 20 రోజుల్లో ఛోటా రాజన్ను భారత్కు పంపిస్తామని ఇండోనేసియా అధికారులు చెప్పారు. ఛోటా రాజన్ను బాలి విమానాశ్రయంలో ఇండోనేసియా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు