భారత్‌లో అతి చౌక 4జీ ఫోన్

17 Jan, 2015 12:59 IST|Sakshi
భారత్‌లో అతి చౌక 4జీ ఫోన్

న్యూఢిల్లీ: లెనొవొ కంపెనీ భారత్‌లో అత్యంత చౌకైన 4జీ ఫోన్, లెనొవొ ఏ6000ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఫోన్ ధర రూ.6,999 అని లెనొవొ ఇండియా డెరైక్టర్ (స్మార్ట్‌ఫోన్స్) సుధిన్ మాధుర్ చెప్పారు. షియోమి కంపెనీ రెడ్‌మి నోట్ 4జీ(ధర రూ.9,999), ఈ కామర్స్ సంస్థ, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్‌ను విక్రయిస్తున్నామని మాధుర్ పేర్కొన్నారు. ఈ నెల 28న జరిగే ఫ్లాష్ సేల్ మోడల్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఐదు అంగుళాల డిస్‌ప్లే ఫోన్ పనిచేస్తుంది.
 

మరిన్ని వార్తలు