14న రాష్ట్రానికి కొత్త రాజధాని ఎంపిక కమిటీ

8 May, 2014 18:36 IST|Sakshi
14న రాష్ట్రానికి కొత్త రాజధాని ఎంపిక కమిటీ

న్యూఢిల్లీ: కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఎంపిక కోసం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ తొలిసారిగా ఈ నెల14న రాష్ట్రానికి రానుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కమిటీ విస్తృత పర్యటనలు చేయనుంది. రెండు దశల్లో పర్యటనలకు వెళ్లాలని కమిటీ సభ్యులు నిర్ణయానికి వచ్చారు.

మొదటి దశలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రాజమండ్రిలో కమిటీ పర్యటించనుంది. ఒంగోలు, తిరుపతి, కర్నూలులలో రెండో విడత పర్యటన ఉంటుంది. రెండు, మూడురోజుల పాటు పర్యటించి రాజధాని ఏర్పాటుకు అనువుగా ఉండే ప్రాంతాలపై అధ్యయనం చేయాలనే నిర్ణయానికి వచ్చింది. శివరామకృష్ణన్ అధ్యక్షతన ఏర్పడిన ఈ కమిటీలో  రతిన్ రాయ్, అరోమర్ దేవి, జగన్ షా, రవీంద్రన్‌ సభ్యులుగా ఉన్నారు.

మరిన్ని వార్తలు