దంతెవాడలో మావోయిస్టుల దాడి

6 Nov, 2014 19:07 IST|Sakshi

మావోయిస్టులు పంజా విసిరారు. ఎన్ఎండీసీ గనిపై దాడికి తెగబడ్డారు. గని వద్ద ఉన్న పొక్లెయిన్ను మావోయిస్టులు తగులబెట్టారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా బైలదిల్లా గనుల్లో గురువారం చోటుచేసుకుంది.

సమాచారం అందుకున్న సీఆర్పీఎఫ్ బలగాలు హుటాహుటిన తరలివెళ్లాయి. మావోయిస్టులకు, సీఆర్పీఎఫ్ బలగాలకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్టు సమాచారం.

మరిన్ని వార్తలు