15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

1 Oct, 2013 13:08 IST|Sakshi

జింద్ జిల్లాలోని కుర్ద్ గ్రామంలో 15 ఏళ్ల బాలికపై నిన్న ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారని పాల్పడ్డారని పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం జిల్లా కేంద్రమైన జింద్లో వెల్లడించారు. నిందితలు ముగ్గురు పవన్, నరేందర్, దల్షర్లులుగా గుర్తించినట్లు తెలిపారు. అయితే వారంతా పరారీలో ఉన్నారని చెప్పారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు.

 

సామూహిక అత్యాచర ఘటన నిన్న చోటు చేసుకుందని చెప్పారు. బహిర్బుమికి వెళ్లిన ఆ బాలికను నిందితులు సమీపంలోని వ్యవసాయ భూమి వైపు  బలవంతంగా తీసుకుని వెళ్లారని, అనంతరం ఆ బాలికపై అత్యాచారం జరిపారని పేర్కొన్నారు. ఆ బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అత్యాచారం గురైనట్లు వైద్యులు దృవీకరించారన్నారు. నిందితులపై కేసు నమెదు చేసినట్లు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు.

మరిన్ని వార్తలు