మదర్ ధెరిసాకు సెయింట్హుడ్

4 Sep, 2016 18:39 IST|Sakshi
మదర్ ధెరిసాకు సెయింట్హుడ్

వాటికన్ సిటీ: భారతరత్న, నోబెల్ శాంతి బహుమతి విజేత మదర్ థెరిసాకు ఆదివారం వాటికన్ సిటీలో సెయింట్‌హుడ్ బహూకరించారు. రోమన్ కేథలిక్ చర్చి పోప్ ఫ్రాన్సిస్ ఈ గొప్ప బిరుదును ఇచ్చారు.  ఈ మహత్కార్యక్రమానికి భారత్ తరపున విదేశాంగ మంత్రి సుష్మస్వరాజ్, ఢిల్లీ, బెంగాల్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, మమత బెనర్జీ తదితరులు హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా థెరిసా అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నిర్యాణం తర్వాత ఎవరైనా మదర్, ఫాదర్‌లు తమను కొలిచిన వారికి అనారోగ్యాన్ని నయం చేయటం, సమస్యలనుంచి గట్టెక్కించటం చేస్తే వారికి ఈ అరుదైన గౌరవాన్ని అందిస్తారు. ఒక అద్భుతం చేసినట్లు గుర్తిస్తే పవిత్రమూర్తిగా (బీటిఫైడ్), 2 అద్భుతాలు జరిగితే దేవతామూర్తిగా (సెయింట్)గా గుర్తిస్తారు. సాక్ష్యాలు సేకరించి వాటిని ధృవీకరించుకున్నాకే పేరును ప్రకటిస్తారు.
 
 థెరిసా గురించి క్లుప్తంగా..

 జననం: 1910 ఆగస్టు 26
 జన్మస్థలం: మెసడోనియా రాజధాని స్కోప్జె
 తల్లిదండ్రులు: నికోలా బొజాక్షియు, డ్రేన్
 అసలు పేరు: ఆగ్నెస్ గోన్షా బొజాక్షియు
 థెరిసాగా పేరు మార్పు: 1929లో భారత్‌కు వచ్చాక
 ఉద్యోగం: కలకత్తాలోని సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాలలో 1931-48 మధ్య ఉపాధ్యాయురాలు
 సొంత చారిటీ సంస్థ: ద మిషనరీస్ ఆఫ్ చారిటీ-1950 అక్టోబర్ 7న ప్రారంభం
 పురస్కారాలు: మెగసెసే(1962), నోబెల్ బహుమతి (1979), భారత రత్న (1980)
 మరణం: కలకత్తాలో 1997 సెప్టెంబర్ 5
 

మరిన్ని వార్తలు