బహుదా నదిలో వృద్ధురాలి మృతదేహం లభ్యం

30 Aug, 2015 13:34 IST|Sakshi

ఇచ్చాపురం: శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని బహుదానదిలో గల్లంతైన వృద్ధురాలి మృతదేహాన్ని ఆదివారం గుర్తించారు. రత్తకన్న గ్రామానికి చెందిన చామంతి (68) స్థానిక మహిళలతో కలసి శ్రావణ పౌర్ణమి సందర్భంగా శనివారం బహుదానదీ తీరంలో పూజలకు వెళ్లారు. నదిలో దిగడంతో ఆమె గల్లంతయ్యారు. గాలింపు చర్యలు చేపట్టగా ఆదివారం ఉదయం చామంతి మృతదేహాన్ని గుర్తించారు.

మరిన్ని వార్తలు