రూ.20కే ప్రయాణ బీమా

4 Aug, 2013 01:21 IST|Sakshi

ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సేవలు అందించే అభిబస్ డాట్‌కామ్ ద్వారా టికెట్ తీసుకుంటే బీమా రక్షణ కల్పించడానికి ప్రైవేటు బీమా కంపెనీ ఐసీఐసీఐ లాంబార్డ్ ముందుకొచ్చింది. టికెట్ ధర ఎంతైనా రూ.20 చెల్లించడం ద్వారా ప్రయాణ సమయంలో ఏదైనా ప్రమాదం సంభవిస్తే రూ. రెండు లక్షల వరకు బీమా రక్షణ కల్పిస్తారు. హాస్పిటల్ ఖర్చుల కింద గరిష్టంగా రూ.1.5 లక్షలు, రోజుకు రూ.500 చొప్పున గరిష్టంగా ఏడు రోజులు డైలీ అలవెన్స్ లభిస్తుంది. ఈ మేరకు రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది.

>
మరిన్ని వార్తలు