నేడు రాష్ట్రపతితో వైఎస్‌ జగన్‌ భేటీ

6 Apr, 2017 01:21 IST|Sakshi
నేడు రాష్ట్రపతితో వైఎస్‌ జగన్‌ భేటీ

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులివ్వడాన్ని ప్రణబ్‌ దృష్టికి తీసుకెళ్లనున్న వైఎస్సార్‌సీపీ బృందం

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చినందుకు నిరసనగా చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో భాగంగా.. ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 6వ తేదీన భారత రాష్ట్రపతి ప్రణబ్‌కుమార్‌ ముఖర్జీతో భేటీ కానున్నారు.

గురువారం మధ్యాహ్నం 2 గంటలకు వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలతో కూడిన ప్రతినిధి బృందం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్‌ ముఖర్జీతో సమావేశమవుతుంది. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని చంద్రబాబు ఎలా అపహాస్యం చేస్తున్నారో రాష్ట్రపతికి ఈ సందర్భంగా జగన్‌ వివరిస్తారని పార్టీవర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు