బ్రాండింగ్‌ ‘చేప’ట్టిన సర్కారు.. ‘ఫిష్‌ ఆంధ్ర’కు ప్రమోషన్‌

29 Dec, 2022 06:30 IST|Sakshi

కన్సల్టెంట్‌ నియామకానికి నోటిఫికేషన్‌ జారీ 

సాక్షి, అమరావతి: ’ఫిష్‌ ఆంధ్ర’ బ్రాండింగ్‌ను మరిం­తగా ప్రోత్సహించేందుకు మత్స్య శాఖ­చర్య­లు చేపట్టింది. అంతర్జాతీయ మార్కెట్‌లో నెల­కొన్న ఒడిదుడుకులతో ఆక్వా రంగంలో తరచూ తలెత్తు­తున్న సంక్షోభం దృష్ట్యా కేవలం ఎగుమతుల­పైనే ఆధారపడకుండా స్థానిక వినియోగంపైనా దృష్టి సారించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు అనుగుణంగా మత్స్య ఉత్పత్తుల తలసరి విని­యో­గం పెంచడం.. తద్వారా ఆక్వా రైతులు, మత్స్య­కా­రు­లకు అండగా నిలబడటమే లక్ష్యంగా ముందుకె­ళుతోంది.

ఇందులో భాగంగా రాష్ట్రంలో లభించే స­ముద్ర, రైతులు పండించే మత్స్య ఉత్ప­త్తులను ‘ఫిష్‌ ఆంధ్ర’ పేరిట హబ్‌లు, అవుట్‌లెట్స్, కియోస్క్‌ల ద్వారా మత్స్య శాఖ విక్రయిస్తోంది. వీటిని బ్రాండింగ్‌ చేసేందుకు ప్రత్యేకంగా యూ­ట్యూబ్‌ చానల్‌తో పాటు ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్, ట్విట్టర్‌ లాంటి సోషల్‌ మీడియా వేదికల ద్వారా ప్రమోట్‌ చేయనుంది. డోర్‌ డెలివరీ కోసం ప్రత్యేకంగా యాప్‌ను డిజైన్‌ చేయనున్నారు.

కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థ (సీఆర్‌­ఎంఎస్‌) ద్వారా వినియోగదారులు ఎలాంటి ఉత్ప­త్తులను ఎక్కువగా ఇష్టపడుతున్నారనే దానిపై ప్రతి­రోజూ ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటూ మార్కెటింగ్‌ సౌక­ర్యాలను కల్పించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కన్స­ల్టెంట్‌ నియమించనున్నారు.

ఆసక్తి కల్గిన ఏజెన్సీల నుంచి రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్స్‌ (ఆర్‌ఎఫ్‌పీ) కోరుతూ బుధవారం మత్స్యశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆసక్తి గల ఏజెన్సీలు  www.fisheries.ap.­gov.in అనే వెబ్‌సైట్‌ ద్వారా టెండర్‌ డాక్యుమెంట్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని వచ్చే నెలాఖరులోగా apfisheriestender­@­gmail.comలో దరఖాస్తు చేసుకోవాలని మత్స్యశాఖ కమిషనర్‌ కె.కన్నబాబు కోరారు.

మరిన్ని వార్తలు