ఏపీలో కొత్తగా 4,872 కరోనా కేసులు

7 Jun, 2021 18:45 IST|Sakshi

సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 64,800 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 4,872 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 86 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 11,552 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 13,702 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 16 లక్షల 37 వేల 149 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు 1,98,56,521 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,14,510 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు.. శ్రీకాకుళం- 166, విజయనగరం- 207, విశాఖ- 189, తూ.గో- 810, ప.గో- 160, కృష్ణా- 175, గుంటూరు- 374,  ప్రకాశం- 447, నెల్లూరు- 232, చిత్తూరు- 961, అనంతపురం- 535, కర్నూలు- 212, వైఎస్ఆర్ జిల్లా- 404 కేసులు నమోదయ్యాయి.

చదవండి: ఆనందయ్య K మందుకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

మరిన్ని వార్తలు