జాతీయ స్థాయిలో ఏపీఎస్‌ఆర్టీసీకి మరో అవార్డు.. వరుసగా అయిదోసారి

25 Feb, 2023 14:01 IST|Sakshi

సాక్షి, విజయవాడ: జాతీయ స్థాయిలో ఏపీఎస్‌ఆర్టీసీకి మరో అవార్డు దక్కింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ నిర్వహించిన డిజిటల్ టెక్నాలజీ పోటీల్లో ఎంటర్‌ప్రైజ్‌ అప్లికేషన్ విభాగంలో డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డు లభించింది. ఇటీవల ప్రవేశపెట్టిన (UTS) డిజిటల్ చెల్లింపులకు గానూ ఈ అవార్డు దక్కింది.

కాగా ఏపీఎస్‌ఆర్టీసీకి ఈ అవార్డు దక్కడం వరుసగా అయిదోసారి. కొచ్చిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోటేశ్వరరావు, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ (ఐటీ) శ్రీనివాసరావు ఈ అవార్డును అందుకున్నారు.  ప్రయాణీకులకు ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు ఆర్టీసీకి ప్రశంసలు

మరిన్ని వార్తలు