యాచకుడే దాతగా మారిన వేళ.. రూ.2 లక్షల విరాళం

16 Dec, 2022 04:26 IST|Sakshi
గౌతంరెడ్డికి రూ.2లక్షల నగదు అందజేస్తున్న యడ్ల యాదిరెడ్డి

 కోటి రుద్రాక్ష అభిషేక, అర్చనకు రూ.2 లక్షల విరాళం

మధురానగర్‌ (విజయవాడ సెంట్రల్‌): యాచకుడే దాతగా మా­రా­డు...ఆంధ్రా షిరిడీ ముత్యా­లంపాడు శ్రీషిరిడీ సాయిబాబా మందిరంలో లోక కల్యాణార్ధం చేపట్టిన కోటి రుద్రాక్ష అభిషేక, అర్చనకు రూ.2లక్షల విరాళ­మి­చ్చాడు.

ఆలయంలో 2023 మా­ర్చి 28న తలపెట్టిన ఈ కార్య­క్రమానికి యాచకుడు యాదిరెడ్డి గురువారం రూ.2 లక్షల విరాళాన్ని మందిర గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ పూనూరు గౌతంరెడ్డికి అందజేశాడు.

యాదిరెడ్డి గతంలో మందిరంలో గోశాల, దత్తాత్రేయస్వామివారికి వెండి ఆభరణాలు, నిత్యాన్న­దానం తదితర కార్యక్రమాలకు రూ.9 లక్షలు విరాళంగా ఇచ్చాడు. 

మరిన్ని వార్తలు