వెల్లంపల్లి శ్రీనివాస్‌ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన సీఎం జగన్‌

14 Dec, 2022 19:13 IST|Sakshi

సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. బుధవారం మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో జరిగిన ఈ వివాహ వేడకకు సీఎం ముఖ్య అతిథిగా విచ్చేశారు. నూతన వధూవరులు సాయి అశ్విత, మంచుకొండ చక్రవర్తిలను సీఎం జగన్‌ ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ వెంట మంత్రులు బొత్స సత్యనారాయణ, తానేటి వనిత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, రాహుల్లా, డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఉన్నారు.

చదవండి: (నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్‌)

మరిన్ని వార్తలు