బీఆర్‌ అంబేద్కర్‌కు సీఎం జగన్‌ నివాళి

6 Dec, 2020 12:45 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘన నివాళి అర్పించారు. ఆదివారం రోజున సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆయన అంబేద్కర్‌ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో హోమ్ మంత్రి మేకతోటి సుచరిత, ఎంపీ నందిగం సురేష్, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ కన్వీనర్ మేరుగ నాగార్జున, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు