64.40 లక్షల మందికి రూ.1,775.33 కోట్లు

5 Nov, 2023 03:56 IST|Sakshi

98.26% మందికి పింఛన్ల పంపిణీ పూర్తి

సాక్షి, అమరావతి: నవంబర్‌ నెలకు సంబంధించి రాష్ట్ర­వ్యాప్తంగా 64,40,536 మంది అవ్వాతా­తలు, వితంతు, దివ్యాంగ, దీర్ఘకాలిక వ్యాధిగ్ర­స్తులు, వివిధ రకాల చేతి వృత్తిదారులకు రూ.1,775.33 కోట్ల మొత్తాన్ని పిం­ఛన్లుగా ప్రభుత్వం పంపిణీ చేసింది. నాలుగు రోజు­­లుగా వలంటీర్లే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్‌ డబ్బు­లు పంపిణీ చేశారు. ఇప్పటికే 98.26 శాతం లబ్ధిదా­రులకు పంపిణీ పూర్తయిందని అధికా­రులు వెల్ల­డించారు. మిగిలిన వారి కోసం ఆదివారం సెలవు రోజు అయినా వలంటీర్ల ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు