తిరుపతిలో భక్తుల రద్దీ

15 Dec, 2023 09:29 IST|Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమలలో  భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి  భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. 

స్వామివారిని గురువారం  56,049 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,748 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. గురువారం ఒక్కరోజే హుండీ ఆదాయం రూ. 3.97 కోట్లు వచ్చింది.

ఇదీచదవండి..నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం

>
మరిన్ని వార్తలు