వైఎస్సార్‌సీపీ గెలుపు కోసమే పనిచేస్తాం: ఐపాక్‌ కీలక ప్రకటన

23 Dec, 2023 19:45 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ రాజకీయాలకు సంబంధించి ఐపాక్‌ కీలక ప్రకటన చేసింది. 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గెలుపు కోసం తాము పనిచేస్తున్నట్టు చెప్పుకొచ్చింది. 

కాగా, ఐపాక్‌ ట్విట్టర్‌ వేదికగా..‘ఆంధ్రప్రదేశ్‌ ప్రజల అభివృద్ధి కోసం అనునిత్యం కృషి చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌కు మా వంతు తోడ్పాటు అందిస్తాం. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీతో కలిసి పనిచేస్తున్నాం. 2024 ఎన్నికల్లో​ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గెలుపుకోసమే మేము పనిచేస్తాం’ అని స్పష్టం చేసింది. 

>
మరిన్ని వార్తలు