మూడు నెలల్లో విశాఖ రాజధాని.. మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

1 Jan, 2023 13:32 IST|Sakshi

సాక్షి, విజయనగరం: మూడు నెలల్లో విశాఖపట్నం రాజధాని అవుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలో ఆదివారం ఆయన అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ఈ ఏడాది సీఎం జగన్ మరింత మంచి పాలన అందిస్తారన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
చదవండి: ప్రతి ఇల్లు ఆనందంగా ఉండాలి: సీఎం జగన్‌ 

మరిన్ని వార్తలు