మాది సహనంతో కూడిన సమర్ధత కలిగిన ప్రభుత్వం 

9 Dec, 2020 15:52 IST|Sakshi

 ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: తమది సహనంతో కూడిన సమర్ధత కలిగిన ప్రభుత్వమని, ప్రచారం చేసుకునే ప్రభుత్వంకాదని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ప్రజలు పని జరిగిందా లేదా అని చూస్తారు తప్ప ఆర్బాటం కాదన్నారు. శంకుస్థాపనల కోసం కాకుండా ప్రారంభోత్సవాలు చేయడం తమ లక్ష్యంగా పేర్కొన్నారు. టీడీపీ నేతలు సబ్జెక్ట్  తెలిసీ తెలియక మాట్లాడుతున్నారని, గత ప్రభుత్వం ఆర్భాటంతో, ఆత్రుతతో, అసమర్ధత తో పని చేసిందని విమర్శించారు. బుధవారం పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ కర్నూలులోని ఓర్వకల్లు ఎయిర్ పోర్టు కమర్షియల్ ఆపరేషన్‌కు సిద్ధంగా ఉంది. ( ‘తపాలా శాఖ అందరికి వారధిగా ఉంటుంది’ )

కమర్షియల్ ఆపరేషన్‌కు సంబంధించిన అనుమతుల గురించి కేంద్రంతో మాట్లాడాను. ఓర్వకల్లు ఎయిర్ పోర్టు త్వరలో ప్రారంభోత్సవం చేస్తాం. భోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించిన షిఫ్టింగ్, టెక్నికల్ అంశాలపై మాట్లాడాం. అన్ని అంశాలపై సానుకూలంగా  స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుంది. సివిల్ ఏవియేషన్‌కు సంబంధించిన పనులన్నీ ఓ కొలిక్కి వచ్చాయి. బోగాపురం ఎయిర్‌పోర్టు శంకుస్థాపన కూడా త్వరలోనే జరుగుతుంది’’ అని అన్నారు.

మరిన్ని వార్తలు