నాపై దాడి చేసింది టీడీపీ నేతలే: ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్‌

30 Apr, 2022 16:36 IST|Sakshi

సాక్షి, ఏలూరు: జి.కొత్తపల్లిలో తనపై టీడీపీ నేతలే దాడికి ప్రయత్నించారని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు తెలిపారు. వైఎస్సార్‌సీపీ గ్రామ అధ్యక్షుడు గంజి ప్రసాద్‌ను హత్య చేశారని తెలిసి తాను అక్కడికి వెళ్లగానే టీడీపీ నాయకులు, కొత్త వ్యక్తులతో కలిసి మూకుమ్మడిగా దాడి చేయబోయారని వివరించారు. ఎవరి ప్రోద్బలంతో ఈ దాడులకు పాల్పడ్డారో పోలీసులు తేల్చాలన్నారు.
చదవండి: ఏలూరు కొత్తపల్లిలో తీవ్ర ఉద్రిక్తత

మరిన్ని వార్తలు