స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ సలహాదారుగా నారమల్లి పద్మజ

17 Nov, 2022 13:15 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నారమల్లి పద్మజను నియమించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు గురువారం ఓ జీవోను విడుదల చేసింది.

మహిళా అభివృద్ధి, శిశుసంక్షేమ శాఖలో సలహాదారుగా ఆమె నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని ఓ జీవో పేర్కొంది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ఏఆర్‌ అనురాధ పేరిట ఆ జీవో విడుదల అయ్యింది.

మరిన్ని వార్తలు