నెల్లూరు: నర్సాపూర్‌-ధర్మవరం రైలుకు తప్పిన ప్రమాదం

30 Jul, 2023 08:18 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: నర్సాపూర్‌-ధర్మవరం రైలుకు పెను ప్రమాదం తప్పింది. కాగా, రైల్వే పట్టాలపై గుర్తుతెలియని దుండగులు రైలు పట్టాను అడ్డుగా పెట్టారు. ఈ క్రమంలో ట్రాక్‌పై పట్టాను రైలు ఢీకొట్టింది. దీంతో, రైలు పట్టా పక్కకు పడిపోవడంతో ప్రమాదం తప్పింది. 

వివరాల ప్రకారం.. నర్సాపూర్‌-ధర్మవరం రైలు శనివారం అర్ధరాత్రి ట్రాక్‌పై వెళ్తుండగా కొందరు రైల్వే పట్టాలపై 2 మీటర్ల రైలు పట్టాను అడ్డుగా పెట్టారు. ఈ క్రమంలో రైలు బలంగా ఢీకొనడంతో ఓ పట్టా.. ట్రాక్‌పై పక్కకు పడిపోయింది. లేకపోతే పెను ప్రమాదం జరిగి ఉండేదని అధికారులు తెలిపారు. ఇక, ఈ ఘటన కావలి, బిట్రగుంట సమీపంలోని ముసునూరు వద్ద చోటుచేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఆర్‌పీఎఫ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. 

ఇది కూడా చదవండి: పీఎస్‌ఎల్‌వీ సీ-56 రాకెట్‌ ప్రయోగం విజయవంతం


 

మరిన్ని వార్తలు